18 నుంచి టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

18 నుంచి టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు పరీక్షలు

Feb 4 2026 7:13 AM | Updated on Feb 4 2026 7:13 AM

18 ను

18 నుంచి టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు పరీక్షలు

18 నుంచి టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు పరీక్షలు గుంటూరు ఎడ్యుకేషన్‌: టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు–2026 (టీసీసీ)లో భాగంగా డ్రాయింగ్‌, టైలరింగ్‌, ఎంబ్రాయిడరీలో లోయర్‌, హయ్యర్‌ గ్రేడ్‌ పరీక్షలు ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ షేక్‌ సలీమ్‌ బాషా మంగళవారం ఓప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు బీఎస్‌ఈఏపీ.ఓఆర్జీ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. గుంటూరు నగరంపాలెంలోని స్టాల్‌ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ, మార్కెట్‌ సెంటర్లోని హిందూ కాలేజీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో డ్రాయింగ్‌ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట, తిరిగి మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలని, హాల్‌ టికెట్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఆధార్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డును వెంట తెచ్చుకోవాలని సూచించారు. బ్యాంక్‌ నిధుల దుర్వినియోగంలో మరొకరు అరెస్ట్‌ రేషన్‌ దుకాణాల్లో జేసీ విస్తృత తనిఖీలు

నగరంపాలెం: జీడీసీసీ బ్యాంక్‌ (నల్లపాడు బ్రాంచ్‌)లో నిధుల దుర్వినియోగం కేసులో మరొకర్ని అరెస్ట్‌ చేశామని గుంటూరు సీసీఎస్‌ డీఎస్పీ బీవీ.మధుసూదనరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం కేసు వివరాలను సీసీఎస్‌ డీఎస్పీ తెలిపారు. జీడీసీసీ బ్యాంక్‌ (నల్లపాడు బ్రాంచ్‌)లో నిధుల దుర్వినియోగంపై గతేడాది నవంబర్‌ 28న డివిజనల్‌ కో–ఆపరేటివ్‌ అధికారి కె.శీనారెడ్డి ఫిర్యాదుతో నల్లపాడు పీఎస్‌లో కేసు నమోదైందని అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేపట్టామని చెప్పారు. ఈ మేరకు ఏ–8 అయిన బాపట్ల టౌన్‌ పటేల్‌నగర్‌ రెండో వీధిలో ఉంటున్న పీటా వెంకటేశ్వరావు కదలికలపై నిఘా ఉంచామని అన్నారు. ఈనెల రెండో తేదీన అతన్ని గుంటూరు బ్రాడీపేటలోని జీడీసీసీ బ్యాంక్‌ సమీపాన అరెస్ట్‌ చేశామన్నారు. గతంలో వెంకటేశ్వరరావు నల్లపాడు జీడీసీసీ బ్యాంక్‌ పాలకవర్గంలో సభ్యుడిగా నామినేట్‌ చేశారని తెలిపారు. అతన్ని కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల న్యాయస్థాన కస్టడీకి ఆదేశించారని అన్నారు. పరారీలో ఉన్న కొందర్ని త్వరలో అరెస్ట్‌ చేస్తామన్నారు.

గుంటూరు వెస్ట్‌: జిల్లాలో రేషన్‌ దుకాణాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ మంగళవారం తెలిపారు. జిల్లా పౌర సరఫరాల అధికారి, వారి సిబ్బందితో కలసి విస్తృతంగా తనిఖిలను నిర్వహిస్తున్నారన్నారు. ఈ నెలలో రేషన్‌ పంపిణీ జరుగుతున్న పలు చౌక ధరల దుకాణాలలో పౌర సరఫరాల సిబ్బంది ఆకస్మికగా తనఖిలను నిర్వహించి వాటిలో వ్యత్యాసాలు గుర్తించిన రేషన్‌ దుకాణాల డీలర్లపై 6ఎ, క్రిమినల్‌ కేసులను నమోదు చేయడం జరిగిందని వివరించారు. గుంటూరు నగరంలో రేషన్‌ షాప్‌ నెంబర్‌ 0781095, 0781106, 0781141లలో తనిఖీలను నిర్వహించగా ఆ దుకాణాల్లో బియ్యం తక్కవగా ఉండటాన్ని గుర్తించడం జరిగిందని తెలిపారు. రేషన్‌ షాపుల నెంబర్లు 0781003, 0781018, 0781015 లో తనిఖీలను నిర్వహించగా వాటిలో బియ్యం ఎక్కువగా ఉండటాన్ని గుర్తించామన్నారు. తాడేపల్లి మండల పరిధిలో రేషన్‌ షాప్‌ నెంబర్‌ 0793014 లో తనిఖీలు నిర్వహించగా అక్కడ కూడా బియ్యం తక్కవగా ఉండటాన్ని గుర్తించి డీలర్లపై కేసులను నమోదు చేశామన్నారు. పీడీఎస్‌ బియ్యం కొనుగోలు, విక్రయాలు జరిపితే నేరమని తెలిపారు. అమ్మినా, కొన్నా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జేసీ హెచ్చరించారు.

18 నుంచి టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు పరీక్షలు 1
1/2

18 నుంచి టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు పరీక్షలు

18 నుంచి టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు పరీక్షలు 2
2/2

18 నుంచి టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు పరీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement