టైప్ పరీక్షలకు 43 మంది హాజరు
రేపల్లె: స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆదివారం తెలుగు, ఇంగ్లిష్ టైపురైటింగ్ పరీక్షలు లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్, ఇంగ్లిష్ జూనియర్ గ్రేడ్ల విభాగాలలో ప్రశాంతంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, టైప్ పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ పరీక్షలకు ఇంగ్లిష్ లోయర్ గ్రేడ్ 25 మందికి గాను 24 మంది, హయ్యర్ గ్రేడ్ 14 మంది, జూనియర్ గ్రేడ్ నలుగురు, తెలుగు హయర్ గ్రేడ్కు ఒక్కరు చొప్పున మొత్తం 44 మందికి 43 మంది హాజరైనట్లు పేర్కొన్నారు.


