పుస్తకాల వైపు యువత దృష్టి
సీనియర్ సంపాదకులు కె.రామచంద్రమూర్తి విజయవాడలో 36వ పుస్తక మహోత్సవం ప్రారంభం
వన్టౌన్(విజయవాడపశ్చిమ):యువత దృష్టి పుస్తకాలపై మరలుతోందని సీనియర్ సంపాదకులు కె.రామచంద్రమూర్తి అన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యాన స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసి న 36వ విజయవాడ పుస్తక మహోత్సవం శుక్రవారం ప్రారంభమైంది. ప్రారంభ సభకు అతిథి గా హాజరైన రామంద్రమూర్తి ఇతర అతిథులతో కలిసి రచయిత బీవీ పట్టాభిరామ్కు నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ పట్టాభిరామ్ వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, రచయితగా తాను ప్రోత్సహించానన్నారు. ఆ తర్వాత ఆయన అనేక అద్భుత పుస్తకాలను తీసుకొచ్చారని వివరించా రు. సాహితీవేత్త డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లా డుతూ ఆధునిక ఎలక్ట్రానిక్ మాధ్యమాలు పుస్తకాలకు ప్రత్యామ్నాయాలు కాలేవన్నారు. ఆత్మీయ అతిథి సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ మాట్లాడుతూ అమరావతిలో పుస్తక మహోత్సవానికి పది ఎకరాల స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీనియర్ పాత్రికే యులు అప్పరసు కృష్ణారావు మాట్లాడారు. పుస్తక మహోత్సవ సంఘ కార్యదర్శి కె.లక్ష్మయ్య స్వాగతోపన్యాసం చేయగా, ఎమెస్కో అధినేత డి.విజయకుమార్ సభ నిర్వహించారు.


