ఈవీఎం గోదాములను భద్రంగా ఉంచాలి | - | Sakshi
Sakshi News home page

ఈవీఎం గోదాములను భద్రంగా ఉంచాలి

Dec 28 2025 8:21 AM | Updated on Dec 28 2025 8:21 AM

ఈవీఎం గోదాములను భద్రంగా ఉంచాలి

ఈవీఎం గోదాములను భద్రంగా ఉంచాలి

బాపట్ల: ఈవీఎం గోదాములను భద్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ అధికారులకు సూచించారు. ఈవీఎం గోదాముల త్రైమాసిక పరిశీలనలో భాగంగా కలెక్టర్‌ శనివారం స్థానిక ఈవీఎం గోదాములను పరిశీలించారు. రాజకీయపార్టీల నాయకుల సమక్షంలో గోదాములను తెరిచి ఈవీఎం యంత్రాలు, వి.వి.పాట్స్‌ను ఆయన పరిశీలించారు. గోదాములకు వేసిన తాళాలు, భద్రత, సంబంధిత దస్త్రాలను పరిశీలించారు. ఈవీఎం గోదాముల భద్రతపై ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు పరిశీలించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు, నిబంధనలను అనుసరించి తనిఖీలు చేయాల్సి ఉందన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం ఉండరాదన్నారు. విధులలో ఉన్న పోలీసుల కోసం గోదాము వెలుపల వైపు గదిని, మరుగుదొడ్లను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్‌, ఆర్డీఓ పి గ్లోరియా, ఎన్నికల విభాగం, కలెక్టరేట్‌ కో ఆర్డినేషన్‌ సెక్షన్‌ పర్యవేక్షకులు షేక్‌ షఫీ, వైఎస్సార్‌ సీపీ నాయకులు ఇనగలూరి మాల్యాద్రి, బీజేపీ నాయకులు రామకృష్ణ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డి.రవి, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు బాలాజీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల భవనాలు త్వరితగతిన పూర్తి చేయాలి

గ్రామ, వార్డు సచివాలయాలు భవనాల నిర్మాణం 2026 జనవరి 31నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌ మినీ వీసీ హాలులో గ్రామ, వార్డు సచివాలయ భవనాల నిర్మాణ పనులు, ఈకేవైసీ, ఏపీ సేవ పేమెంట్‌, స్కూల్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి బాల బాలికలు, టీచర్లు పాఠశాలలకు హాజరు, ఎంఈఓలు పాఠశాల తనిఖీ, ఎంబీయూ, మధ్యాహ్నం భోజనం, తల్లికి వందనం, వివిధ అంశాలపై ఎంపీడీఓలు, ఎంఈ ఓ 1– 2లు, గ్రామ, వార్డు సచివాలయాల అధికారుల తో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈకేవైసీ, ఏపీ సేవ పేమెంట్‌ పెండింగ్‌ లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించా రు. నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నా రు. బాలబాలికలు వంద శాతం పాఠశాలలకు హాజరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, మండల విద్యాశాఖ అధికారులు తమ పరిధిలోని పాఠశాలలను వారానికి రెండు రోజులు తనిఖీ చేయాలన్నారు. తల్లికి వందనం పథకం ఇంకా జిల్లాలో కొందరికి రాలేదని, ఏ కారణం చేత తల్లికి వందనం రాలేదో పరిశీలించి వంద శాతం పూర్తి చేయాలని ఎంఈఓలను ఆదేశించారు. వ్యక్తిగత కారణాలతో పనులు పెండింగ్‌ పెడితే బాధ్యులపై చర్య లు తీసుకుంటామని తెలిపారు. డీఎల్‌డీఓ విజయలక్ష్మి, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్‌ యశ్వంత్‌, డిప్యూటీ డీఈఓలు, పీఆర్‌ ఈఈ పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement