
కూలిన వంతెన స్థానంలో అప్రోచ్ రోడ్డు
సిద్దవటం : కడప–బద్వేలు మార్గ మధ్యంలోని అటవీ ప్రాంతంలో కిటికీల వంతెన కూలిపోయిన నేపథ్యంలో ఆదివారం అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బి ఏఈ రామాంజనేయులు మాట్లాడుతూ రహదారికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన అప్రోచ్ రోడ్డుకు గ్రావెల్ వేయించి డోజర్తో చదును చేయించామన్నారు. దీంతో లారీలు, బస్సులు యాథావిధిగా రాకపోకలు సాగిస్తాయన్నారు. అప్రోచ్ రోడ్డు రహదారిపై సిమెంటు పైపులు వేసి రహదారిని ఎత్తు లేపుతామన్నారు. లేదంటే వర్షాలకు గ్రావెల్ కొట్టుకు పోతుందన్నారు.