గుర్రం జాషువా సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

గుర్రం జాషువా సేవలు చిరస్మరణీయం

Sep 29 2023 1:52 AM | Updated on Sep 29 2023 1:52 AM

గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి 
నివాళులర్పిస్తున్న అధికారులు  
 - Sakshi

గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న అధికారులు

రాయచోటి: గుర్రం జాషువా సేవలు చిరస్మరణీయమని జిల్లా పర్యాటకశాఖ అధికారి నాగభూషణం అన్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లో గురువారం గుర్రంజాషువా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో అధికారులు గుర్రం జాషువా ఫొటోకి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ గుర్రం జాషువా గబ్బిలం వంటి తన రచనలు ద్వారా అణగారిన వర్గాలకు ఎన్నో సేవలందించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకుడు సహదేవ రెడ్డి, జిల్లా పరిశ్రమలశాఖ అధికారి నాగరాజ, హౌసింగ్‌ పీడీ సాంబశివయ్య, జిల్లా ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారి అబ్సోలం, కలెక్టరేట్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement