తాడేపల్లి. రేపు(శుక్రవారం, ఆగస్టు 28వ తేదీ) రాఖీ పండుగను పురస్కరించుకుని ఏపీలోని మహిళలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు శుభాకాంక్షలు తెలియజేశారు.
రక్షాబంధనం అన్నది ఆత్మీయతలూ అనురాగాల పండుగ అని గుర్తు చేసిన వైఎస్ జగన్.. అక్కచెల్లెమ్మలకు ఎప్పుడూ అన్ని విధాలుగా మంచి జరగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు దేవుడి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లకాలం లభించాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ తన సందేశంలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
పంచదార్ల కొండపై వైఎస్సార్సీపీ పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం


