వైఎస్సార్‌సీపీ నేతలతో ముగిసిన వైఎస్‌ జగన్‌ భేటీ | YS Jagan YSRCP Key Meeting Oct 7th News Updates | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేతలతో ముగిసిన వైఎస్‌ జగన్‌ భేటీ

Oct 7 2025 10:18 AM | Updated on Oct 7 2025 1:46 PM

YS Jagan YSRCP Key Meeting Oct 7th News Updates

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఆ పార్టీ కీలక భేటీ ముగిసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు హాజరయ్యారు. 

ఈ సమావేశంలో.. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ అంశంతో పాటు రాష్ట్రంలో యదేచ్ఛగా నడుస్తున్న నకిలీ మద్యం వ్యవహారంపై వైఎస్‌ జగన్‌ ప్రముఖంగా ప్రసంగించినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై ప్రజా పోరాటం చేయాలని కేడర్‌కు ఆయన పిలుపు ఇచ్చినట్లు సమాచారం. 

ఈ భేటీకి కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కాకాణి గోవర్దన్‌ రెడ్డి, పేర్ని నాని, భూమన కరుణాకర్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు. 

 

జగన్‌ హయాంలో మొదలైన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ప్రజా పోరాటానికి పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో 9వ తేదీన అనకాపల్లి జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటించిన.. మాకవరం మెడికల్‌ కాలేజీని సందర్శించనున్న సంగతి తెలిసిందే.

	ఇవాళ YSRCP ముఖ్య నేతలతో వైఎస్ జగన్ భేటీ

ఇదీ చదవండి: బాబు చీటర్‌.. లోకేష్‌ లూటర్‌!

Advertisement
 
Advertisement
Advertisement