
సాక్షి, తాడేపల్లి: నేడు కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. కందుకూరి వీరేశలింగం పంతులుకి నివాళులు అర్పించారు. ఆయన ఆశయాలు ఈ తరానికి స్ఫూర్తిదాయకమని గుర్తు చేశారు.
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. స్త్రీ జనోద్ధరణకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు. తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి కందుకూరి. సాహితీవేత్తగా, సంఘ సంస్కర్తగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆశయాలు ఈ తరానికి స్ఫూర్తిదాయకం. నేడు కందుకూరి వీరేశలింగం పంతులుగారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

స్త్రీ జనోద్ధరణకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సాహితీవేత్తగా, సంఘ సంస్కర్తగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆశయాలు ఈ తరానికి స్ఫూర్తిదాయకం. నేడు కందుకూరి వీరేశలింగం… pic.twitter.com/iWSZyidJE1
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 16, 2025