
సాక్షి, అమరావతి : దివంగత నేత, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్రావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి తనయుడు ఎమ్యెల్యే జక్కంపూడి రాజా, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు పేర్ని నాని, చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, పలువురు నాయకులు పాల్గొన్నారు.