
సాక్షి, తాడేపల్లి: నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి. ఈ సందర్బంగా పీవీకి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళి అర్పించారు. సంస్కరణలతో దేశ ఆర్థిక స్థితిని మలుపు తిప్పిన దార్శనికుడు పీవీ అని ప్రశంసించారు.
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘సంస్కరణలతో దేశ ఆర్థిక స్థితిని మలుపు తిప్పిన దార్శనికుడు భారతరత్న పీవీ నరసింహారావు. భారతదేశ తొలి తెలుగు ప్రధానిగా దేశానికి ఎన్నో విశేషమైన సేవలందించిన పీవీ జయంతి సందర్భంగా నివాళులు’ అంటూ వ్యాఖ్యానించారు.
సంస్కరణలతో దేశ ఆర్థిక స్థితిని మలుపు తిప్పిన దార్శనికుడు భారతరత్న పీవీ నరసింహారావు గారు. భారతదేశ తొలి తెలుగు ప్రధానిగా దేశానికి ఎన్నో విశేషమైన సేవలందించిన పీవీ గారి జయంతి సందర్భంగా నివాళులు.#PVNARSIMHARAO pic.twitter.com/zU8ZGDJBwl
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 28, 2025