సాక్షి, అమరావతి: వాతావారణ శాఖ రాష్ట్రానికి వర్ష హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మన్యం, విజయనగరం, అల్లూరి, పోలవరం జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. వాటితో పాటు అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.


