
విశాఖలో ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న జీ20 సదస్సు కోసం విదేశీ ప్రతినిధులు హాజరు..
సాక్షి, విశాఖ: మార్చి 28, 29వ తేదీల్లో జరిగే జీ20 సదస్సు కోసం పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు నగర సీపీ సీహెచ్ శ్రీకాంత్ వెల్లడించారు. జీ20 సదస్సుకు విదేశాల నుంచి 250 మంది ప్రతినిధులు హాజరు అవుతారనే అంచనా. ఈ నేపథ్యంలో..
సదస్సు కోసం హాజరయ్యే విదేశీ ప్రతినిధులకు పటిష్ట భద్రత కల్పించనున్నట్లు సీపీ వెల్లడించారు. విదేశీ ప్రతినిధులు బస చేసే హోటళ్ల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పటిష్టంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.