Andhra Pradesh: 4.92 లక్షల మందికి టీకా

Vaccination for teenagers in many educational institutions in Andhra Pradesh - Sakshi

తొలిరోజు అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 72,719 మందికి..

పలుచోట్ల విద్యా సంస్థల్లోనూ టీనేజర్లకు వ్యాక్సినేషన్‌

7వ తేదీ వరకు డ్రైవ్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 15–18 ఏళ్ల వారి కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి సోమవారం విశేష స్పందన లభించింది. ఉదయం పది గంటల నుంచి టీకా వేసే ప్రక్రియ ప్రారంభించగా అది రాత్రి వరకు కొనసాగింది. తొలిరోజు రాష్ట్రంలోని 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్‌ సెంటర్లలో 4,92,613  మందికి కోవాగ్జిన్‌ టీకా వేశారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 72,719 మందికి చేశారు.

కొన్నిచోట్ల ఆరోగ్య సిబ్బంది పాఠశాలలకు వెళ్లి వేశారు. కోవిన్‌ యాప్‌లో పేరు రిజిస్టర్‌ చేసుకున్న వారికి నేరుగా టీకా ఇవ్వగా.. మిగిలిన వారికి ఆధార్‌ కార్డు, పాఠశాల గుర్తింపు కార్డులోని వివరాలు నమోదు చేసి టీకా వేశారు. ఇక 7వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తొలి డోసు తీసుకున్న నాలుగు వారాల తర్వాత రెండో డోసు ఇస్తారు. 25 లక్షల మంది యువత లక్ష్యం కాగా 40 లక్షల కోవాగ్జిన్‌ డోసులను సిద్ధంగా ఉంచారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top