సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు

Tribal MLAs Meet CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: శాసనసభలో సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సోమవారం అసెంబ్లీలో గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు కలిశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలపై సీఎంతో చర్చించారు. ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పాముల పుష్పశ్రీవాణి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, అరకు ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణ, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి హాజరయ్యారు.


చదవండి: అనుచిత ప్రవర్తన.. స్పీకర్‌పై పేపర్లు విసిరిన టీడీపీ సభ్యులు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top