
సాక్షి, అల్లూరి: అల్లూరి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం.
వివరాల ప్రకారం.. అల్లూరి జిల్లాలోని రంపచోడవరం ఏజెన్సీ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కించకూరు-కాకవాడి గండి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులు ఉదయ్ మృతి ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల్లో మరో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు.