
సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. శ్రీరామనవమి సందర్భంగా కృష్ణా నదిలో స్నానానికి దిగి ముగ్గురు బాలురు మృతి చెందారు. ఆదివారం ఉదయం మత్తి కిరణ్, మత్తి వీరబాబు, మత్తి వర్ధన్ స్నానానికి నదిలోకి దిగి గల్లంతయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని.. గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ వెలికితీశాయి.