గ్రా‘నైట్‌’..రైట్‌రైట్‌! | TDP Rowdy attacked at granite factories | Sakshi
Sakshi News home page

గ్రా‘నైట్‌’..రైట్‌రైట్‌!

Jun 22 2025 6:24 AM | Updated on Jun 22 2025 6:24 AM

TDP Rowdy attacked at granite factories

అర్ధరాత్రి ఒంటి గంటకు చిత్తూరు గాంధీ విగ్రహం మీదుగా స్మగ్లింగ్‌ చేస్తున్న గ్రానైట్‌ దిమ్మె

ఫ్యాక్టరీల వద్ద కూటమి నేతల రౌడీ మామూళ్లు 

ఒక్కో బ్లేడ్‌కు రూ.35 వేల చొప్పున.. నెలకు రూ.10 కోట్లు వసూలు 

కప్పం కట్టకుంటే.. మైన్స్, విజిలెన్స్‌ దాడులు 

అంతా తెలిసినా పట్టనట్టు వ్యవహరిస్తున్న యంత్రాంగం  

చిత్తూరు అర్బన్‌: భూగర్భ గనులశాఖ (మైన్స్‌) పరిపాలన చిత్తూరు జిల్లాలో పూర్తిగా గాడి తప్పింది. సహజ ఖనిజాలను తవ్వుకున్నప్పుడు ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీనరేజ్‌ (ఖనిజాల రాయల్టీ) రుసుములను వసూలు చేయాల్సిన గనులశాఖ చేతులు పైకెత్తేసింది. అధికార పారీ్టకి చెందిన నాయకులు గత ఐదు నెలలుగా ఫ్యాక్టరీల నుంచి దౌర్జన్యంగా సీనరేజ్‌ వసూలు చేసుకుంటుంటే వేడుక చూస్తోంది. కూటమి నేతలు వేసే బిస్కట్లకు ఆశపడ్డ కొందరు అధికారులు.. ప్రభుత్వ ఖజానాకు జమకావాల్సిన రూ.కోట్ల సొమ్మును నేతల జేబుల్లోకి మళ్లిం చేయడం విమర్శలకు తావిస్తోంది.  

రౌడీ మామూళ్లు  
చిత్తూరు, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో గ్రానైట్‌ ఖనిజాలు విస్తారంగా ఉన్నాయి. క్వారీల రూపంలో వీటిని దక్కించుకున్న వ్యక్తులు భూగర్భ గనులశాఖ పర్యవేక్షణలో గ్రానైట్‌ రాళ్లను తవి్వ, వాటిని ఫ్యాక్టరీల్లో కట్‌ చేయించి, పాలిష్‌ వేసి, ఆపై విక్రయిస్తుంటారు. ఈ వ్యాపారం చేయడానికి వ్యాపారులు క్యూబిక్‌ మీటరు గ్రానైట్‌కు వాటి రంగు ఆధారంగా స్లాబ్‌ పద్ధతుల్లో ప్రభుత్వానికి సీనరేజ్‌ రుసుములను చెల్లించాలి.

రాఘవ కన్‌స్ట్రక్చన్స్‌ అనే కంపెనీ ఫ్యాక్టరీల నుంచి రుసుములు చెల్లించే కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీతో ఈ కంపెనీకి రుసుములు వసూలు చేసుకునే కాల పరిమితి ముగిసింది. ప్రైవేటు కంపెనీ స్థానంలో మైన్స్‌ శాఖ, ప్రభుత్వం నిర్ణయించిన రుసుములను వ్యాపారుల నుంచి వసూలు చేయాల్సి ఉంది. కానీ గత ఐదు నెలలుగా రుసుముల వసూళ్ల నుంచి మైన్స్‌ అధికారులను పక్కకు తోసేసిన కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు.. ఫ్యాక్టరీల నుంచి నెల నెలా బెదిరించి, బలవంతంగా రౌడీ మామూళ్లు వసూలుచేసి వారి జేబుల్లో వేసుకుంటున్నారు.  

ఇష్టారాజ్యం  
కొందరు క్వారీ యజమానులు గ్రానైట్‌ ఖనిజాన్ని దోచుకుంటున్నారు. భారీ మొత్తంలో గ్రానైట్‌ వెలికితీసి, అక్రమంగా సరిహద్దులు దాటిస్తున్నారు. ప్రధానంగా రాత్రి 11 గంటలు దాటితే చిత్తూరు, కుప్పం, గంగాధరనెల్లూరు ప్రాంతాల నుంచి భారీ వాహనాల్లో గ్రానైట్‌ స్మగ్లింగ్‌ జరుగుతోంది. చిత్తూరుకు చెందిన ఇద్దరు అధికార పార్టీ నాయకులు ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement