సీఎం జగన్‌ వల్లే మాకు మేలు

TDP Janmabhumi Commitee Member Got Disability Pension From Kakinada - Sakshi

పిఠాపురం: కాకినాడ జిల్లా తాటిపర్తికి చెందిన టీడీపీ జన్మభూమి కమిటీ సభ్యుడు నున్న సత్యనారాయణకు చేనేత పింఛన్, ఆయన మనవరాలికి దివ్యాంగ పింఛన్‌ వచ్చింది. ఎమ్మెల్యే పెండెం దొరబాబు బుధవారం పింఛన్‌లు అందించారు. తొలిసారి పింఛన్‌ అందుకున్న సత్య­నారాయణ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యా­రు. సీఎం వైఎస్‌ జగన్‌ దయ వల్లే తనకు పింఛన్‌ రా­వడంతో పాటు తన మనవరాలు వైకల్యాన్ని జయిం­చిందన్నారు.

‘నా మనవరాలు లిఖి­త­శ్రీ పుట్టుక నుం­చే దివ్యాంగురాలు(మూగ, చెవుడు). మాది నిరుపేద కుటుంబం. ఆపరేషన్‌ చేయించాలంటే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చవుతుందని చెప్పారు. పిల్లలకు ప్రభు­త్వం ఉచితంగా ఆపరేషన్లు చేయించి ఆదుకుంటోందని తెలిసి.. అధికారులను కలిశాను. వారు ఒక చెవికి ఆపరేషన్‌ మాత్రమే చేస్తామని, సీఎం జగన్‌ను కలుసుకుంటే పూర్తిగా ఆపరేషన్‌ చేసే అవకా­శం ఉందన్నారు.

తాను టీడీపీ జన్మభూ­మి కమిటీ సభ్యుడిని అయినందున తనకు సాయం చేస్తారో లేదోనని భయపడ్డాను. కానీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు చొరవతో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి కష్టాలు చెప్పుకొన్నాం. విపక్ష పార్టీ వాడినని చూడకుండా ఆయన వెంటనే ఎంత ఖర్చయినా పాప­కు వినికిడి, మాట వచ్చేలా చూడాలని అధికారు­లను ఆదేశించారు. మా మనవరాలికి చెవుల­కు ప్రభుత్వమే రూ.14 లక్షలు ఖర్చుపెట్టి ఆపరేషన్‌ చేయించడమే గాక, ఏడాదిన్నర పాటు ఉచితంగా మం­దులు కూడా ఇచ్చింది. ఇప్పుడు నా మనవరా­లు కోలుకుంది. దానికి సీఎం వైఎస్‌ జగనే కారణం’ అం­టూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top