సాక్షి, కోనసీమ: ద్రాక్షరామ గురుకుల పాఠశాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బిల్లీపాల్ అనే విద్యార్థిపై తోటి 10 మంది విద్యార్థులు దాడి చేశారు. దీంతో మనస్థాపం చెందిన బిల్లీపాల్ సూసైడ్ నోట్ రాసి ఎవరికి కనిపించకుండా వెళ్లిపోయారు. దీంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. విద్యార్థి క్షేమంపై తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


