ఆఫ్గన్‌ మిషన్‌లో సిక్కోలు సైనికుడు

Srikakulam ITBP Soldiers Services In Afghan Mission For Returning Indian People - Sakshi

భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చిన బృందంలో ఐటీబీపీ కమాండో రాజశేఖర్‌ 

మందస: తాలిబన్ల స్వాధీనంతో అట్టుడికిపోతున్న ఆఫ్గనిస్తాన్‌ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకురావడంలో భారత–టిబెటన్‌ సరిహద్దు భద్రతా దళం కమాండోలు కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ దళంలో శ్రీకాకుళం జిల్లా వాసి కూడా ఉన్నారు.

మందస మండలం చిన్నలింబుగాం గ్రామానికి చెందిన పులారి రాజశేఖర్‌ ఆఫ్గన్‌లో భారత రాయబార కార్యాలయంలో ఉన్నవారిని స్వదేశానికి తీసుకొచ్చే మిషన్‌లో చురుగ్గా వ్యవహరించారు. ప్రత్యేక విమానంలో వీరిని దేశానికి తీసుకురాగా.. రాజశేఖర్‌ వారి రక్షణ విధులు నిర్వర్తించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top