TTD: నేడు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల | Special Entry Dharshan tickets for November month | Sakshi
Sakshi News home page

TTD: నేడు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

Aug 24 2024 8:54 AM | Updated on Aug 24 2024 12:48 PM

Special Entry Dharshan tickets for November month

తిరుపతి, సాక్షి:  తిరుమల శ్రీవారి నవంబర్‌ నెల దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి వీటిని బుకింగ్ చేసుకోవచ్చు.

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్…! నవంబర్‌ నెలకు సంబంధించిన దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేస్తోంది. ఇప్పటికే అంగప్రదక్షిణం టోకెన్ల కోటాతో పాటు శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా టికెట్లను విడుదల చేసేసింది. అయితే ఇవాళ(ఆగస్టు 24) ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది.  

మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా టికెట్లను కూడా టీటీడీ విడుదల చేయనుంది. https://ttdevasthanams.ap.gov.in  వెబ్ సైట్ లోకి వెళ్లి వీటిని బుకింగ్ చేసుకోవచ్చు. ఇక ఆగష్టు 27వ తేదీన తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా టికెట్లను ఉదయం 11 గంటలకు విడుదల చేయనుంది. న‌వ‌నీత సేవ టికెట్లు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ టికెట్లను మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ 
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ  . శ్రీవారి దర్శనానికి 24   గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 31  కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . నిన్న 69,098  మంది స్వామి వారిని దర్శించుకున్నారు.  34,707   మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.56  కోట్లు  . మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 12   కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.5  గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4  గంటల సమయం పడుతోంది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement