
సాక్షి, హైదరాబాద్: ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అమరావతిలో మహిళలను కించపరిచారంటూ ఆయనపై ఏపీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్కు చేరుకున్న పోలీసులు.. సోమవారం ఉదయం కొమ్మినేనిని అరెస్ట్ చేసి ఏపీ తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొమ్మినేని అరెస్ట్ను పలువురు జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు ఖండిస్తున్నాయి. కూటమి సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
👉సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును జూపూడి ప్రభాకర్రావు ఖండించారు. కొమ్మినేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సరికాదన్నారు.
👉సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. టీడీపీ, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కృష్ణంరాజు వ్యాఖ్యలను కొమ్మినేని తప్పుబట్టారు. అధికారం ఇచ్చింది అక్రమ కేసులు పెట్టడానికా?. దీనిపై మూడు రోజులుగా టీడీపీ, ఎల్లో మీడియా రాద్ధాంతం దారుణం. విశ్లేషకుల అభిప్రాయాలు వారి వ్యక్తిగతం. కృష్ణంరాజు వ్యాఖ్యలను కొమ్మినేని ఆపేశారు. లేని విషయాన్ని క్రియేట్ చేసి విష ప్రచారం చేయడమే టీడీపీ పని.. అనవసర విషయాలపై రాద్ధాంతం చేస్తున్నారు. సాక్షిలో కేఎస్ఆర్ న్యూట్రల్గా డిబేట్లు నిర్వహిస్తారు. ఆయన పొరపాటున కూడా అసభ్యకరంగా మాట్లాడరు. చంద్రబాబు పాలనలో అరాచకమే ఉంది. సంక్షేమం లేదు.
👉భూమన కరుణాకర్ రెడ్ది స్పందిస్తూ.. రాజకీయ లబ్ధి కోసమే కొమ్మినేని అరెస్ట్. ఉద్దేశ్యపూర్వకంగానే టీడీపీ, జనసేనలు నిరసనలు. కృష్ణంరాజు వ్యాఖ్యలను సాక్షి ఖండించింది. మహిళలను టీడీపీ, జనసేన పార్టీలు రెచ్చగొడుతున్నాయి. దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. సాక్షిపై దాడి.. ప్రజల గొంతుకలపై ఉక్కుపాదం. టీడీపీ గూండాలే దాడికి పాల్పడుతున్నారు.
👉 జర్నలిస్ట్ తిలక్ స్పందిస్తూ.. కొమ్మినేని అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నా. కొమ్మినేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా పెడతారు? అని ప్రశ్నించారు.
👉 మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి స్పందిస్తూ.. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం. లైవ్ డిబెట్లో ఎవరో మాట్లాడిన మాటలకు కేఎస్ఆర్కు సంబంధం ఏంటి అని ప్రశ్నించారు.
👉 హైకోర్టు లాయర్ వెంకటేశ్ శర్మ స్పందిస్తూ.. కొమ్మినేని ఎప్పుడూ పరిధి దాటరు. కొమ్మినేనిని అక్రమంగా అరెస్ట్ చేశారు. కొమ్మినేనిపై రాజకీయ కక్ష పెంచుకున్నారు. కేఎస్ఆర్ చర్చల్లో ప్రజల వాణి వినిపిస్తుంది.
సాక్షి, హైదరాబాద్: ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అమరావతిలో మహిళలను కించపరిచారంటూ ఆయనపై ఏపీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్కు చేరుకున్న పోలీసులు.. సోమవారం ఉదయం కొమ్మినేనిని అరెస్ట్ చేసి ఏపీ తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొమ్మినేని అరెస్ట్ను పలువురు జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు ఖండిస్తున్నాయి. కూటమి సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
👉 జర్నలిస్ట్ తిలక్ స్పందిస్తూ.. కొమ్మినేని అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నా. కొమ్మినేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా పెడతారు? అని ప్రశ్నించారు.

👉 మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి స్పందిస్తూ.. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం. లైవ్ డిబెట్లో ఎవరో మాట్లాడిన మాటలకు కేఎస్ఆర్కు సంబంధం ఏంటి అని ప్రశ్నించారు.
👉 హైకోర్టు లాయర్ వెంకటేశ్ శర్మ స్పందిస్తూ.. కొమ్మినేని ఎప్పుడూ పరిధి దాటరు. కొమ్మినేనిని అక్రమంగా అరెస్ట్ చేశారు. కొమ్మినేనిపై రాజకీయ కక్ష పెంచుకున్నారు. కేఎస్ఆర్ చర్చల్లో ప్రజల వాణి వినిపిస్తుంది.
👉 వైఎస్సార్సీపీ నాయకులు అనంత వెంకట్రామిరెడ్డి స్పందిస్తూ.. కొమ్మినేని అరెస్ట్ను ఖండిస్తున్నాం. ప్రజా గొంతుక వినిపించడంలో కొమ్మినేని ముందుంటారు. సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు మాటలను ఎవరూ సమర్థించరు. వైఎస్సార్సీపీ, సాక్షి పత్రిక కృష్ణం రాజు వ్యాఖ్యలను ఖండించింది. సాక్షికి సంబంధంలేని మాటలను పట్టుకుని కొమ్మినేని ఎలా అరెస్ట్ చేస్తారు. కూటమి ప్రభుత్వ చర్యలతో ఐఏఎస్, ఐపీఎస్లు కూడా భయపడుతున్నారు. ప్రజల గొంతుక, జర్నలిస్టుల గొంతులు నొక్కడమే కూటమి ప్రభుత్వం పని.