తూర్పుగోదావరి: రాయవరం మండలం వెంటూరుకు చెందిన జి.నందినికి పన్నుతో పాప పుట్టింది. ఆ పసికందును ద్రాక్షారామలోని భీమేశ్వర దంత వైద్యశాలకు సోమవారం తీసుకువచ్చారు. దంతం బాగా కోరగా ఉండటంతో పాలు తాగించడానికి ఇబ్బంది కలుగుతోందని తెలపడంతో, ఏడు రోజుల ఆ పసికందుకు డాక్టర్ బచ్చు క్రాంతికుమార్ చాకచక్యంగా పన్నును తొలగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన ఆరు నెలకు రావాల్సిన దంతం, జన్యుపరమైన వ్యత్యాసాలతో పుట్టుకతోనే రావడం జరిగిందన్నారు. అటువంటి సందర్భాలలో ఒక్కోసారి పన్ను దానంతట అదే కదిలిపోయి ఊడిపోవచ్చన్నారు. అలా జరిగితే ఆ పన్ను పసికందు ఊపిరితిత్తుల్లోకి పోయి ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. దీంతో ఆ పన్నును తొలగించినట్టు తెలిపారు.


