
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో విషాదం చోటుచేసుకుంది. మద్యం మత్తు కారణంగా మరో కుటుంబం చిన్నాభిన్నమైంది. మద్యం సేవించి రోజు భార్య పిల్లలను భర్త పవన్ చితకబాదటంతో ఇద్దరు పిల్లలతో సహా తల్లి బావిలో దూకింది.
పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. కుమారుడు మణికంఠ, తల్లి గీత మృతి చెందగా.. కుమార్తె యొక్షితని స్థానికులు కాపాడారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.