జియో ట్యాంగింగ్‌ ద్వారా సివిల్‌ సప్లై వాహనాన్ని ట్రాక్‌ చేస్తాం: మంత్రి కారుమూరి

Minister Karumuri Inaugurates Civil Supply Command Control Room - Sakshi

సాక్షి, విజయవాడ: మంత్రి కారుమూరి నాగేశ్వర రావు విజయవాడలో బుధవారం సివిల్‌ సప్లై కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి కారుమూరి కీలక వ్యాఖ్యలు చేశారు. ధాన్యం సప్లై ఎలా జరుగుతుందో మానిటర్‌ చేయడానికే కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 

కాగా, ఈ సందర్బంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ.. ధాన్యం తరలిస్తున్న వాహనం దారి మళ్లినా క్షణాల్లో సమాచారం అందుతుంది. అన్ని సివిల్‌ సప్లై వాహనాలకు జియో ట్యాగింగ్‌ చేస్తాము. ఇలా జియో ట్యాంగింగ్‌ ద్వారా వాహనాన్ని ట్రాక్‌ చేస్తామన్నారు. ఈ క్రమంలోనే సివిల్‌ సప్లైలో అప్పులు పెరగడానికి చంద్రబాబే కారణమని అన్నారు. వార్డు మెంటర్‌గా కూడా గెలవలేని వ్యక్తి నారా లోకేష్‌ అంటూ కామెంట్స్‌ చేశారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top