పరిపాలన వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం: మంత్రి బొత్స

Minister Botsa Satyanarayana Comments On Special Status for Andhra Pradesh - Sakshi

సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన చట్టంలో ఇచ్చిన హామీ అని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభలో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారు. సీఎం జగన్‌ ఆ హామీని నెరవేర్చమని కేంద్రాన్ని అడుగుతున్నారు. మూడు రాజధానులు, పరిపాలన వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం. రాజధాని ఎక్కడ అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. కేంద్రం కూడా అదే చెప్పింది అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 

చదవండి: (కొత్త జిల్లాల్లో కార్యాలయాలన్నీ ఒకే చోటు: విజయ్‌ కుమార్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top