దేవాలయాల పరిరక్షణకు పటిష్ట చర్యలు | Mekathoti Sucharita Comments About Preservation of temples | Sakshi
Sakshi News home page

దేవాలయాల పరిరక్షణకు పటిష్ట చర్యలు

Sep 27 2020 5:11 AM | Updated on Sep 27 2020 5:11 AM

Mekathoti Sucharita Comments About Preservation of temples - Sakshi

మాట్లాడుతున్న హోం మంత్రి సుచరిత, పక్కన ఎమ్మెల్యే విడదల రజని

చిలకలూరిపేట: దేవాలయాల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని క్రైస్తవ శ్మశానవాటికను ఎమ్మెల్యే విడదల రజనితో కలిసి శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసి విమర్శించేందుకు ఏమీ లేక టీడీపీ వంటి ప్రతిపక్షాలు కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్రలకు పాల్పడుతున్నాయని విమర్శించారు.

ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు అంతర్వేది వంటి ఘటనలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. అందుకే ప్రభుత్వం ఈ కుట్ర కోణాన్ని వెలికి తీసేందుకు అంతర్వేది కేసు విచారణను సీబీఐకి అప్పగించినట్లు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement