గ్లోబల్ వర్చువల్ సమ్మిట్‌: మంత్రి మేకపాటికి ఆహ్వానం | Mekapati Goutham Reddy Has Invited to Global Virtual Summit 2021 | Sakshi
Sakshi News home page

'గ్లోబల్ వర్చువల్ సమ్మిట్‌కు మేకపాటికి ఆహ్వానం

Oct 30 2020 8:52 PM | Updated on Oct 30 2020 9:04 PM

Mekapati Goutham Reddy Has Invited to Global Virtual Summit 2021 - Sakshi

సాక్షి, అమరావతి : 'గ్లోబల్ వర్చువల్ సమ్మిట్-2021'కు ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆహ్వానం అందించింది. దేశాలు, రంగాల వారీగా ఫిబ్రవరిలో నిర్వహించే ఈ భారీ సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సహా పాల్గొనాలని ఆహ్వానించింది. ఏపీ పారిశ్రామిక ప్రగతికి సీఐఐ వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చింది. చదవండి: రిమోట్‌ వర్క్‌పై తర్వలోనే ఎంవోయూలు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఐఐ రీజనల్ డైరెక్టర్ సతీష్ రామన్ శుక్రవారం మంత్రి గౌతమ్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ మేరకు ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీలో సీఐఐతో భాగస్వామ్యానికి మంత్రి మేకపాటి సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో 'ఒక జిల్లా-ఒక వస్తువు'పై పూర్తి స్థాయి నివేదిక అందించేందుకు సీఐఐ ప్రతిపాదన అందించింది. ఎమ్ఎస్ఎమ్ఈ, నైపుణ్యం, వైద్య, మౌలికసదుపాయాల కల్పన, సీఎస్ఆర్ నిధుల అంశాలపై మంత్రి మేకపాటితో సీఐఐ రీజనల్‌ డైరెక్టర్‌ చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement