మేము మొదట నుంచి ఇదే చెప్తున్నాం: కన్నబాబు

Kurasala Kannababu Slams Chandrababu Naidu - Sakshi

కాకినాడ: పరిపాలన వికేంద్రీకరణ అంశానికి సంబంధించి ఈరోజు(సోమవారం) సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ విధానాన్ని సమర్థించేలా ఉన్నాయని మాజీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ప్రజాస్వామ్య వాదులంతా హర్షిస్తున్నారని స్పష్టం చేశారు కన్నబాబు.

మీడియాతో మాట్లాడిన కురసాల కన్నబాబు.. ‘రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని మొదటి నుంచి చెప్తున్నాం. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో చంద్రబాబు భూములు కొనిపించారు.భావి తరాలకు అన్యాయం చేసేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి.రియల్టర్లతో చంద్రబాబు అమరావతి యాత్ర చేయించారు’ అని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top