సాక్షి, అమరావతి: ‘పచ్చ’ కళ్ల వానికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని ఉద్దేశించి రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ విమర్శించారు. తాడేపల్లిలో మంగళవారం ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. టీడీపీ అధికారం కోల్పోయాక మంత్రులుగా పనిచేసిన మాజీలకు పూర్తిగా మతిభ్రమించిందన్నారు. ఆలూరు నియోజకవర్గం వచ్చి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
నిరాధార ఆరోపణలు చేస్తే పరువు నష్టం కేసు వేస్తానని మంత్రి హెచ్చరించారు. ఫ్యాక్టరీ పెట్టాలనే తలంపుతో 15 ఏళ్ల క్రితం మంజునాథ్, మను అనే సోదరులు రైతుల వద్ద భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. తరువాత వారి మధ్య విభేదాలు రావడంతో అందులో కొద్దిపాటి భూమిని మాత్రమే మంజునాథ వద్ద తాను కొన్నానని వివరించారు. ఒక బీసీ రైతు 30 ఎకరాలు కొనుగోలు చేయకూడదా అని ప్రశ్నించారు. రెండెకరాల చంద్రబాబు రూ.వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడో అయ్యన్నపాత్రుడు సమాధానం చెప్పాలని నిలదీశారు.
అయ్యన్నకు మతి భ్రమించింది: జయరాం
Published Wed, Oct 7 2020 6:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement