ఏఎన్యూ పీజీ ప్రశ్నాపత్రంలో మూడుచోట్ల ఒకే ప్రశ్న
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగారు్జన యూనివర్సిటీ(ఏఎన్యూ) పీజీ పరీక్షల నిర్వహణలో అధికారుల బాధ్యతారాహిత్యం మరోసారి బట్టబయలైంది. విద్యార్థుల భవిష్యత్కు సంబంధించిన పరీక్షల నిర్వహణలో వరుసగా లోపాలు తలెత్తుతున్నా వాటిని సరిదిద్ది పకడ్బందీగా నిర్వహించడంపై సంబంధిత అధికారులు కనీసం దృష్టి సారించడం లేదనేది శుక్రవారం జరిగిన ఘటనతో స్పష్టమవుతోంది.
ప్రశ్నాపత్రంలో ఒకే ప్రశ్న మూడుచోట్ల ఇవ్వడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. తర్జనభర్జనల తరువాత గంట ఆలస్యంగా మరో ప్రశ్నాపత్రం ఇచ్చి పరీక్షలు రాయించారు. శుక్రవారం ఎం.కామ్ మూడో సెమిస్టర్ కామర్స్ పేపర్లో ఒకే ప్రశ్నను 2బీ, 3ఏ, 4ఏగా ఇచ్చారు. దీన్ని చూసి విద్యార్థులు ఆశ్చర్యపోయారు. సమస్యను ఇని్వజిలేటర్కు వివరించారు. ప్రశ్నాపత్రాన్ని పరిశీలించిన ఇని్వజిలేటర్ జరిగిన తప్పిదాన్ని పీజీ కో–ఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్లడంతో గంట ఆలస్యంగా మరో ప్రశ్నాపత్రం ఇచ్చి పరీక్ష రాయించారు.


