
విశాఖ,సాక్షి: రేపటి నుంచి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. తొలగించిన కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 14వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు దిగనున్నారు.
కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు ఉక్కు పోరాట కమిటీ మద్దతు పలికింది. ‘కుట్ర పూరితంగా కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కేంద్రంపై ఒత్తిడి తేవాలి. లేని పక్షంలో పోరాటం ఉదృతం అవుతుంది’ అని ఉక్కు పోరాట కమిటీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.