TTD : తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే | Huge Devotees Rush At Tirumala | Sakshi
Sakshi News home page

TTD : తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే

Aug 1 2024 7:45 AM | Updated on Aug 1 2024 7:45 AM

Huge Devotees Rush At Tirumala

తిరుపతి, సాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.

మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 5 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా..4 గంటల సమయం పడుతోంది. నిన్న (బుధవారం) 67,916 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 23,010 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం  3.93  కోట్లుగా లెక్క తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement