జగనన్న విద్యా కానుకపై ‘ఈనాడు’ తప్పుడు ప్రచారం | Eenadu False Propaganda On Jagananna Vidya Kanuka - Sakshi
Sakshi News home page

జగనన్న విద్యా కానుకపై ‘ఈనాడు’ తప్పుడు ప్రచారం

Apr 17 2023 7:59 AM | Updated on Apr 17 2023 2:40 PM

Eenadu False Propaganda On Jagananna Vidya Kanuka - Sakshi

సాక్షి, అమరావతి: జగనన్న విద్యా కానుకపై ‘ఈనాడు’ దినపత్రిక అసత్యాలతో దుష్ప్రచారం సా­గి­స్తోందని పాఠశాల విద్యా శాఖ ఆగ్రహం వ్యక్తం చే­సిం­ది. ‘విద్యా కానుక బూట్లు కాళ్లకు పట్టవు’ శీర్షికన ఆది­వారం ప్రచురితమైన వార్త పూర్తిగా అవా­స్త­వమని ఖండించింది. ‘ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వేముల కోట జడ్పీ ఉన్నత పాఠశాలను ఈనెల 15న పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ సందర్శించారు. 7వ తరగతికి వెళ్లి విద్యార్థులు ధరించిన షూలను పరిశీలించారు.

కొంత మంది విద్యార్థులు షూ ధరించలేదు. ఇందుకు వారు చెప్పిన కారణాలు సహేతుకంగా లేకపోవడంతో వారికి ఇచ్చిన షూలు సరిగా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు వారి ఇళ్లకు వెళ్లారు. జి.సందీప్‌ కుమార్, కె.శివపార్వతి ఇళ్ల వద్ద ఉన్న వారి షూలను పరిశీలించారు. అవి ఆ విద్యార్థులకు సరిగ్గా సరిపో­యాయి. ఎలాంటి డ్యామేజీ కూడా లేదు. దీంతో ఆ షూలను విద్యార్థులకు తొడిగించారు. ప్రతి రోజూ పిల్లలతో  షూ ధరింపచేసి స్కూళ్లకు పంపాలని వారి తలిదండ్రులకు సూచించారు.

ఆ తర్వాత ఆ పిల్లల­ను తన వెంట స్కూలుకు తీసుకెళ్లారు. అక్కడి టీచర్ల­తో సమావేశమై 100 రోజుల పాటు అలవాటు చేస్తే వి­ద్యార్థులు తప్పకుండా షూ వేసుకొని వస్తారని సూ­చిం­చారు. ప్రకాశం జిల్లాలో 21 వేల మంది విద్యా­ర్థు­ల­కు సంబంధించిన షూ లను ఎక్స్‌ఛేంజ్‌ చేసి అందిం­చారు. ఈ మేరకు విద్యా శాఖ అన్ని స్కూళ్ల హెచ్‌­ఎంల నుంచి విద్యార్థులందరికీ షూలు సరిపో­యా­యని డిక్లరేషన్‌ కూడా తీసుకుంది. ఈ వాస్తవాలను వి­స్మరించి, విద్యా కానుక బూట్లు విద్యార్థులకు పట్టవు అంటూ ‘ఈనాడు’ అసత్యాలతో వార్త ప్ర­చు­రించడం దారుణం. ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది’ అని ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.   

Advertisement
 
Advertisement
Advertisement