ఆర్బీకేల్లో ఇ–పంట వివరాల ప్రదర్శన

సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) వద్ద ఖరీఫ్ సీజన్కు సంబంధించిన ఇ–పంట నమోదు వివరాలను ఆదివారం నుంచి ప్రదర్శిస్తున్నారు. అభ్యంతరాలు ఉంటే సంబంధిత ఆర్బీకేలోని గ్రామ వ్యవసాయ సహాయకులకు (వీఏఏ) తెలియజేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, పంట వివరాలు నమోదు కాకున్నా, రైతు పేరు లేకున్నా తక్షణమే ఇ–పంట వివరాలు నమోదు చేయించుకోవాలి. లేకుంటే ఆ పంటను కొనుగోలు చేయరు. ఈ ఏడాది నుంచి ఆర్బీకేల వద్దనే వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయనున్న విషయం తెలిసిందే.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి