164వ రోజుకు చేరిన స్టీల్ప్లాంట్ కార్మికుల రిలే దీక్షలు
సాక్షి, విశాఖపట్నం : విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతోంది. స్టీల్ప్లాంట్ కార్మికుల రిలే దీక్షలు 164వ రోజుకు చేరాయి. కూర్మన్నపాలెం నుంచి కార్మిక సంఘాల పాదయాత్ర చేపట్టాయి. నిర్వాసిత కాలనీల్లో కార్మిక సంఘాలు పాదయాత్ర చేస్తున్నాయి. పాదయాత్రలో అఖిలపక్ష నేతలు, కార్మికులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.