Tirumala : శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం | Crowd Of devotees is common in tirumala | Sakshi
Sakshi News home page

Tirumala : శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం

Aug 5 2024 8:37 AM | Updated on Aug 5 2024 10:41 AM

 Crowd Of devotees is common in tirumala

తిరుపతి, సాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 4 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.

మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 3 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా..2 గంటల సమయం పడుతోంది. నిన్న (ఆదివారం) 75,356 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 21,815 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.90  కోట్లుగా లెక్క తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement