Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Crowd Of devotees is common in tirumala | Sakshi
Sakshi News home page

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Aug 3 2024 8:38 AM | Updated on Aug 3 2024 11:12 AM

 Crowd Of devotees is common in tirumala

తిరుపతి, సాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 05 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.

మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 4 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా..4 గంటల సమయం పడుతోంది. నిన్న (శుక్రవారం) 62,540 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 24,241 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.92  కోట్లుగా లెక్క తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement