ఉద్యోగ భద్రత లేకుంటే జీవితం రోడ్డున పడ్డట్లే | Contract Teachers Protest: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఉద్యోగ భద్రత లేకుంటే జీవితం రోడ్డున పడ్డట్లే

Jun 24 2025 4:29 AM | Updated on Jun 24 2025 4:29 AM

Contract Teachers Protest: Andhra Pradesh

మంగళగిరిలోని ఉన్నత విద్యా మండలి కార్యాలయం ఎదుట నిరసన తెలియజేస్తున్న ప్రభుత్వ యూనివర్సిటీల కాంట్రాక్టు అధ్యాపకులు

ప్రభుత్వ వర్సిటీల కాంట్రాక్టు అధ్యాపకుల నిరసన  

సాక్షి, అమరావతి/మంగళగిరి టౌన్‌: న్యాయం కోసం రోడ్డెక్కిన కాంట్రాక్టు అధ్యాపకులపై కూటమి సర్కారు ఉక్కుపాదం మోపింది. శాంతియుతంగా నిరసన తెలియజేసే ప్రాథమిక హక్కును పోలీసుల బలగాలతో కాలరాసింది. దీంతో అధ్యాపకులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగి్వవాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ యూనివర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు సోమవారం మంగళగిరిలోని ఉన్నత విద్యా మండలి కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. కూటమి ప్రభుత్వంలో హక్కులకు పాతరేస్తూ తీసుకొచి్చన కొత్త కాంట్రాక్టు అగ్రిమెంట్‌లోని నిబంధనను తప్పుపట్టారు.

ఉద్యోగ భద్రత లేకపోతే తమ జీవితాలు రోడ్డునపడినట్లేనని ఆందోళన వ్యక్తంచేశారు. చాలీచాలని జీతాలతో కుటుంబాలను వెళ్లదీస్తున్న తమను నిత్యం మానసికంగా చంపేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. దశాబ్దాలుగా వర్సిటీల్లో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న తమకు మినిమం టైమ్‌ స్కేల్‌ (ఎంటీఎం) అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రెగ్యులర్‌ సిబ్బందిలా తమకు డీఏ, హెచ్‌ఆర్‌ఏలతో కూడిన ఎంటీఎంను అందించాలని కోరారు.

ఉద్యోగ విరమణ వయసును 62 నుంచి 65కు పెంచాలని, భవిష్యత్తులో వర్సిటీల్లో నియామకాల సమయంలో తమ పోస్టులను మినహాయించి నోటిఫికేషన్‌ ఇవ్వాలన్నారు. అనంతరం ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ మధుమూర్తినికి వినతిపత్రం సమరి్పంచారు.  ఏపీ యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్స్‌ సమాఖ్య(కాంట్రాక్టు), అధ్యక్షుడు డాక్టర్‌ కె.అర్జునుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement