రేపు సచ్చిదానంద ఆశ్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌ రాక | CM YS Jaganmohan Reddy To Visit Sacchidananda Ashram | Sakshi
Sakshi News home page

రేపు సచ్చిదానంద ఆశ్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌ రాక

Oct 17 2021 4:06 AM | Updated on Oct 17 2021 4:16 AM

CM YS Jaganmohan Reddy To Visit Sacchidananda Ashram - Sakshi

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): విజయవాడ పటమట దత్తానగర్‌లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సందర్శించనున్నారు. ఉదయం 10.15 గంటలకు సీఎం జగన్‌ తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి  బయలుదేరి.. 10.30కి ఆశ్రమానికి చేరుకుంటారు. 10.50 వరకూ ఆశ్రమంలోని ఆలయాన్ని దర్శిస్తారు.

అనంతరం స్వామి సచ్చిదానందతో సమావేశమవుతారు. 11.30 గంటలకు ఆయన నివాసానికి తిరుగు ప్రయాణమవుతారు. ఇదిలా ఉండగా ఆశ్రమంలో సీఎం పర్యటన ఏర్పాట్లను.. సీఎం భద్రతాధికారులు, ఇతర పోలీస్‌ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ శనివారం పరిశీలించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement