తెలుగు ప్రజలకు సీఎం జగన్‌ దీపావళి శుభాకాంక్షలు | CM YS Jagan Diwali Wishes To Telugu People | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజలకు సీఎం జగన్‌ దీపావళి శుభాకాంక్షలు

Oct 23 2022 7:34 PM | Updated on Oct 24 2022 11:09 AM

CM YS Jagan Diwali Wishes To Telugu People - Sakshi

సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. అజ్ఞానంపై ‘జ్ఞానం’.. దుష్ట శక్తులపై ‘దైవశక్తి’.. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలని ఆకాంక్షించారు.

ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగుల‌లో ప్ర‌తి కుటుంబం సుఖ‌సంతోషాల‌తో విరాజిల్లాల‌ని సీఎం అభిలషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement