ఎమ్మెల్సీ మృతిపై  సీఎం జగన్‌ దిగ్భ్రాంతి | CM Jagan Condolences To MLC Sheikh Sabji Demise | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ మృతిపై  సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

Dec 15 2023 2:31 PM | Updated on Dec 15 2023 3:28 PM

CM Jagan Condolences To MLC Sheikh Sabji Demise - Sakshi

సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మరణవార్త తెలుసుకున్న సీఎం జగన్‌ దిగ్భ్రాంతి చెందారు. ఈ మేర​కు షేక్‌ సాబ్జీ మృతి పట్ల కేబినెట్‌ సైతం సంతాపం తెలిపింది. కేబినెట్‌ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.

శుక్రవారం రోడ్డు ప్రమాదంలో  పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ దుర్మరణం చెందారు. ఉండి మండలం చెరుకువాడలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో సాబ్జీ మృతి చెందారు. సాబ్జీ కారు డ్రైవర్‌, గన్‌మెన్‌, పీఏకి తీవ్రగాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

చదవండి: AP: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ దుర్మరణం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement