సాక్షి, అమరావతి: అప్పుల పరంపరను చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తోంది. వచ్చే మంగళవారం మరో రూ.2,600 కోట్ల బడ్జెట్ అప్పు చేయనుంది.
ప్రభుత్వ సెక్యూరిటీలను వేలంలో విక్రయించడం ద్వారా ఈ మొత్తం అప్పును ఆర్బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం నోటిఫై చేసింది.