Photo Credit: Twitter
కృష్ణా: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గన్నవరం ఎయిర్పోర్టులో పోరంకి మహిళలు మంగళవారం ప్రత్యేకంగా కలుసుకున్నారు. విషయంలోకి వెళితే.. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బొడ్డు వినీత్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే వినీత్ మృతి కేసును అక్కడి పోలీసులు పట్టించుకోలేదు. దీంతో తమకు అండగా ఉండాలని వైఎస్ జగన్కు వినీత్ తల్లి సునీల, ఆమె కుటుంబసభ్యులు వినతిపత్రం అందించారు. దీనిని పరిశీలించిన వైఎస్ జగన్ వినీత్ కుటుంబసభ్యులకు అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు.


