వారం పాటు నిర్వహించే అవకాశం
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలను ఈ నెల 17 నుంచి నిర్వహించే అవకాశం ఉందని తెలిసింది. వారం రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. పలు బిల్లులతో పాటు రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించేందుకు ఈ సమావేశాలను వేదికగా చేసుకోవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది.


