ఆర్టీసీ పాలక మండలి భేటీ | APSRTC Governing Council Meeting | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ పాలక మండలి భేటీ

Dec 30 2021 5:01 AM | Updated on Dec 30 2021 2:25 PM

APSRTC Governing Council Meeting - Sakshi

సాక్షి, అమరావతి: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంస్థను అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని ఆర్టీసీ పాలకమండలి నిర్ణయించింది. ఏటా రూ.3 వేల కోట్ల వేతన భారాన్ని ప్రభుత్వమే భరిస్తున్నందున సంస్థకు గణనీయంగా ఆర్థిక వెసులుబాటు కలిగిందని పేర్కొంది. ఆర్టీసీ నూతన పాలకమండలి సమావేశాన్ని బుధవారం విజయవాడలో నిర్వహించారు. కీలకమైన 45 అంశాలతో కూడిన అజెండాపై పాలకమండలి సుదీర్ఘంగా చర్చించింది.
సమావేశంలో మాట్లాడుతున్న మల్లికార్జునరెడ్డి  

కొత్త బస్సుల కొనుగోలు, ఆర్టీసీ బస్‌ స్టేషన్లలో సదుపాయాల మెరుగుదల తదితర అంశాలపై చర్చ సాగింది. కాగా, డ్రైవర్లు, కండక్టర్లను కాంట్రాక్టు విధానంలో నియమించేందుకు ప్రభుత్వ అనుమతి కోరాలని నిర్ణయించినట్టు తెలిసింది. సమావేశంలో ఆర్టీసీ చైర్మన్‌ ఎ.మల్లికార్జునరెడ్డి, ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు, ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ విజయానందరెడ్డి, రవాణా, ఆర్థిక, సాధారణ పరిపాలన శాఖల ముఖ్య కార్యదర్శులు ఎంటీ కృష్ణబాబు, ఎస్‌ఎస్‌ రావత్, శశిభూషణ్‌కుమార్, కేంద్ర ఉపరితల రవాణా శాఖ అధికారి పరేశ్‌కుమార్, సీఐఆర్‌టీ డైరెక్టర్‌ కేవీఆర్‌కే ప్రసాద్, ఏఎస్‌ఆర్టీయూ ఈడీ ఆర్‌.ఆర్‌.కె.కిషోర్‌ పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement