పాలిసెట్‌ అడ్మిషన్స్‌ షెడ్యూల్‌ పొడిగింపు | AP Polycet Admission Schedule Extension | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌ అడ్మిషన్స్‌ షెడ్యూల్‌ పొడిగింపు

Oct 18 2020 4:27 AM | Updated on Oct 18 2020 4:27 AM

AP Polycet Admission Schedule Extension - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ పాలిసెట్‌ అడ్మిషన్ల షెడ్యూలును పొడిగిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్‌ ఎం.ఎం.నాయక్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పొడిగించిన గడువు తేదీలు ఇలా.. 

ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు: అక్టోబర్‌ 21 వరకు 
ధ్రువపత్రాల పరిశీలన, వెబ్‌ ఆప్షన్ల నమోదు: అక్టోబర్‌ 22 వరకు 
సీట్ల కేటాయింపు: అక్టోబర్‌ 24 సాయంత్రం 6 తర్వాత. పాలిసెట్‌లో 60,780 మంది అర్హత సాధించగా శనివారం వరకు 35,346 మంది వెబ్‌ కౌన్సెలింగ్‌కు రిజిస్టర్‌ అయ్యారు. 34,288 మంది ధ్రువపత్రాల పరిశీలన జరగగా, 28,682 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement