అలాంటి పొత్తును సమర్థిస్తారా?.. హరిరామ జోగయ్యకు మంత్రి అమర్నాథ్ మరో లేఖ
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి హరిరామ జోగయ్యకి ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజాగా మరో లేఖాస్త్రం సంధించారు. చంద్రబాబు నాయుడితో పవన్ పొత్తును ఏ విధంగా సమర్థిస్తారని అందులో అమర్నాథ్.. హరిరామ జోగయ్యను నిలదీశారు.
‘వంగవీటి రంగాని చంపించింది చంద్రబాబు నాయుడు అని మీరే పలు సందర్భాల్లో చెప్పారు. అలాంటి చంద్రబాబుతో పొత్తులకు సిద్ధమైన పవన్ కళ్యాణ్ ని మీరు సమర్థిస్తారా..?. స్పష్టం చేయాలని హరిరామ జోగయ్యని నిలదీశారు మంత్రి అమర్నాథ్.