గ్రూప్-2 పరీక్షలు నిలుపుదల సాధ్యం కాదు: ఏపీ హైకోర్టు | AP High Court Says It Is Not Possible To Postpone Group 2 Exams, More Details Inside | Sakshi
Sakshi News home page

గ్రూప్-2 పరీక్షలు నిలుపుదల సాధ్యం కాదు: ఏపీ హైకోర్టు

Feb 20 2025 9:17 PM | Updated on Feb 21 2025 9:09 AM

Ap High Court Says It Is Not Possible To Postpone Group 2 Exams

గ్రూప్-2 పరీక్షలు నిలుపుదల సాధ్యం కాదని హైకోర్టు తెలిపింది

సాక్షి, అమరావతి: గ్రూప్-2 పరీక్షలు నిలుపుదల సాధ్యం కాదని హైకోర్టు తెలిపింది. హరిజాంటల్ రిజర్వేషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తదుపరి చర్యలు నిలుపుదల చేయాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు.. గురువారం విచారణ జరిపింది. పరీక్ష జరగకుండా ఉంటే అర్హులైన అభ్యర్థుల ప్రయోజనాలు ప్రమాదంలో పడతాయన్న కోర్టు.. ప్రధాన పరీక్షకి 92,250  మంది అర్హత సాధించారని పేర్కొంది.

వీరిలో హారిజాంటల్ రిజర్వేషన్ అభ్యంతరంపై ఇద్దరు మాత్రమే కోర్టుకు వచ్చారన్న న్యాయస్థానం.. పరీక్ష నిలుపుదల చేయటం కుదరదని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 11కి వాయిదా వేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement